Article Source :
మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విన్నవించారు.
రైల్వే...
more... మంత్రి అశ్వినీ వైష్ణవ్కు తెలిపిన ఎంపీ బాలశౌరిప్రతిపాదిత రైల్వే లైను నమూనా
ఈనాడు డిజిటల్, అమరావతి: మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విన్నవించారు. మంగళవారం దిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఎంపీ బాలశౌరి సమావేశమై, మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని కోరారు. ‘ఇప్పుడున్న రైల్వే లైనులో మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ మీదుగా తెనాలి చేరుకోవాలంటే సుమారు 145 కిలోమీటర్లు ప్రయాణించాలి. మచిలీపట్నం- రేపల్లె లైను ఏర్పాటైతే రేపల్లె నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలికి చేరుకోవచ్చు. దీనివల్ల దూరం తగ్గడంతో పాటు దివిసీమ ప్రజలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. తెనాలి జంక్షన్కు చేరుకుంటే అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చు. తద్వారా పాటు విజయవాడ జంక్షన్పై భారం తగ్గుతుంది. గతేడాది రద్దు చేసిన మచిలీపట్నం - ధర్మవరం రైలును పునరుద్ధరించాలి. దీని ద్వారా తిరుపతికి వెళ్లే భక్తులకు సులువుగా ఉంటుంది. గుడివాడలోని వడ్లమన్నాడు, మచిలీపట్నంలోని చిలకలపూడి వద్ద రైళ్లను ఆపాలి. నరసాపురం రైల్వే లైను సర్వే కోసం అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు’ అని మంత్రికి తెలిపినట్లు బాలశౌరి ఓ ప్రకటనలో చెప్పారు. చిలకలపూడి, పల్లెపాలెం, బంటుమిల్లి, మాట్లాం మీదుగా రైల్వేలైను ప్రతిపాదనకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్టుడే: ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని మచిలీపట్నం స్టేషన్ సూపరింటెండెంట్ పామర్తి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఎంత మంది ప్రయాణికులు వినియోగించుకుంటారో తెలుసుకునేందుకు ఈ నెల 7, 9 తేదీల్లో రెండు రోజుల పాటు రైలు సర్వీసు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైలు బుధవారం (7వ తేదీ) రాత్రి 11 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి, గురువారం ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నం వస్తుంది. శుక్రవారం (9వ తేదీ) కూడా ఇలాగే బయలుదేరి, తర్వాత రోజు రాత్రి తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమవుతుందని వెల్లడించారు.
#BZA#APNEWRAILWAYLINE#APNRL#MTM#ANDHRARAILINFRA
please wait...Translate to EnglishFrom Machilipatnam to Tirupati by train
From Machilipatnam (Gudurpet), news today: MP Balasouri announced that a train is being arranged from Machilipatnam to Tirupati by the railway officials. This service, how many passengers can benefit from it, Superintendent of Machilipatnam station Nagashevararavu announced in a statement. To know why so many passengers will utilize this service, on the 7th and 9th of this month, a train service is being arranged for two days. This train, on Wednesday (7th date) at night starting at 11 o'clock from Machilipatnam, and on Thursday morning at 8 o'clock reaches Tirupati. On the same day, at 8 o'clock at night in Tirupati, Friday reaches Machilipatnam at 5.30 am. Friday (9th date) also departs in the same manner, and then the night journey from Tirupati returns.