రాష్ట్రానికి కొత్త అదనపు రైళ్లు
Updated: March 14, 2013
Share on favorites | Share on facebook
హైదరాబాద్, మేజర్ న్యూస్: రైల్వే బడ్జెట్ 2013-14లో మంత్రి పవన్కుమార్ బన్సాల్ ప్రకటించిన...
more... రైళ్లకు అదనంగా కొత్త రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్-యశ్వంత్పుర ఎక్స్ప్రెస్ (ట్రైవీక్లీ) వయా కర్నూలు టౌన్, తాండూరు-సికింద్రాబాద్ మెమూ ప్యాసింజర్ ఇందులో ఉన్నాయి. అలాగే హతియా (రాం చీ)-యశ్వంత్పూర్ ఎక్ప్ప్రెస్ (వీక్లీ), ముంబా యి-కారైకాల్ (వెలంకని) ఎక్స్ప్రెస్ (వీక్లీ), వయా చెనై్న, నాగపట్నం కూడా ఉన్నాయి. అలాగే రైలు నెంబర్ 12761/12762 కరీంనగర్-తిరుపతి ఎక్స్ ప్రెస్ను వారంలో రెండురోజులు నడపనున్నారు. అలాగే మంగుళూ రు-కాచిగూడ ఎక్స్ప్రెస్ (వీక్లీ)ను వారంలో రెండు రోజులు నడుపుతారు. రైలు నెంబర్ 17213/17214 నర్సాపూర్-నాగర్సోల్ (సాయినగర్ షిరిడీ) ఎక్స్ప్రెస్ వారంలో మూడు రోజులపాటు నడుస్తుంది. ఈ రైలు గుంటూరు, నడికుడి, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా వారంలో రెండు రోజులు నడుస్తుంది. కాజీపేట, సికింద్రాబాద్ మీద మిగిలిన ఐదు రోజులు నడస్తుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ కె. సాంబశివరావు తెలిపారు. కాకినాడ- ముంబాయి ఎక్స్ప్రెస్ (వీక్లీ) గుంటూరు-నడికుడి-నల్గొండ, బీబీనగర్ మీదుగా నడస్తుంది.
రాష్ట్రానికి డబుల్ డెక్కర్ రైలు:
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కనుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు నిత్యం ఈ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలిసింది. ఎక్కువ రద్దీ మార్గమైన ఈ రూట్లో నడిపితే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఈ కొత్త రైలు కేంద్రం పచ్చజెండా ఊపుతుందని అనుకున్నా ఎలాం టి ప్రకటన రాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు ప్రజా ప్రతి నిధులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి బన్సాల్ను కలిసి ఈ రైలు ఏర్పాటు అవస రాన్ని వివరించారు. దీంతో బన్సల్ ఈ కొత్త రైలుకు అంగీకరించారు. ఈ ప్రతి పాదన కార్యరూపందాలిస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ఈ డబుల్డెక్కర్ రైలు ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్రానికి దక్కనుంది. ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బోగీలతో నడుస్తుంది.
click here