అమరావతి రైలు మార్గానికి అందని సహకారం
నిధులిచ్చేందుకు ముందుకురాని రాష్ట్ర ప్రభుత్వం
వేగవంతంగా జరుగుతున్న గుంతకల్లు డబ్లింగ్ పనులు
మూడు నెలల్లో రేపల్లె - తెనాలి విద్యుద్ధీకరణ పూర్తి
రైల్వే జీఎం గజానన్ మాల్య వ్యాఖ్యలు
గుంటూరు,...
more... నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి నూతన రైలు మార్గాన్ని రైల్వే మంత్రిత్వశాఖ మంజూరు చేసింది. సర్వే కూడా పూర్తి అయింది. అయితే కాస్టు షేరిం గ్కి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ కారణంగానే నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.’ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన నంద్యాల నుంచి రేపల్లె వరకు శుక్రవారం జీఎం ప్రత్యే క రైలులో ప్రయాణించారు. ఆయా స్టేషన్ బిల్డింగ్లు, రైల్వేట్రాక్, ప్లాట్ఫాంలు, బ్రిడ్జీలు, టన్నెల్స్, ఆర్యూబీలను పరిశీలించారు. అనంతరం గుంటూరు రైల్వేస్టేషన్కు చేరు కొని మీడియాతో మాట్లాడారు. ఇటీవల గుం టూరు - గుంతకల్లు, నల్లపాడు - పగిడిపల్లి విద్యుద్దీకరణ ప్రాజెక్టులు పూర్తి కావడంతో అన్ని రైళ్లని ఎలక్ట్రికల్ లోకోలతో నడుపుతు న్నామన్నారు. నడికుడి మార్గం డబ్లింగ్కు ప్రతిపాదన పంపించామని తెలిపారు.
రేపల్లె - తెనాలి విద్యుద్ధీకరణ మరో మూడు నెలల్లో పూర్తి అవుతుందని, దాంతో గుంటూరు డివి జన్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ జరిగినట్లు అవు తుందని చెప్పారు. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ పనులు వేగవంతంగానే జరుగుతు న్నాయన్నారు.
బొగాడ టన్నెల్(సొరంగం) వద్ద ఇంకా అటవీ శాఖ నుంచి అనుమతి రాలేదని, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రెండేళ్లకు పైగా సమయం పడుతుందన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడగానే అదనపు రైళ్లని నడిపేందుకు చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. ఆర్యూబీలు నిర్మించిన చోట డ్రెయినేజీ స్తంభిస్తుందని, దీనిపై ప్రణాళికలు రూపొందిస్తోన్నామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు డీఆర్ ఎం మోహన్రాజా, ఏడీఆర్ఎంలు శ్రీనివాస్, రంగనాథ్, సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కార దిశగా అభివృద్ధి పనులు
వేమూరు, నవంబరు 22: ప్రయాణికుల సమస్యల పరిష్కార దిశగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని జీఎం తెలిపారు. వేమూరు రైల్వే స్టేషన్ సందర్శించారు. విద్యుత్ లైన్ ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్ బ్రిడ్జి నిర్మాణం పనిని ప్రారంభించకపోవడంపై కాంట్రాక్టర్ను నిలదీశారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
నంద్యాల- విజయవాడ ఇంటర్ సిటీ రైలు
రేపల్లె, నవంబరు 22: నంద్యాల- విజయవాడ ఇంటర్ సిటీ రైలు త్వరలో ఏర్పాటు చేయనున్నామని జీఎం తెలిపారు. రేపల్లె రైల్వే స్టేషన్లో ఆయన తనిఖీలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ మూడు నెలల్లో తెనాలి-రేపల్లె రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. రేపల్లె నుంచి డెల్టా ఎక్స్ప్రెస్ సమయాన్ని మార్పు చేయాలని కోరారని ఈ విషయా న్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తెనాలి నుంచి రేపల్లె వరకు హైలెవల్ ప్లాట్పారం పనులు జరుగుతున్నాయని, త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు
click here