నత్తను తలపిస్తున్న రైల్వేలైను విస్తరణ ప్రాజెక్టు(vijayawada-Gudivada-bhimavaram-Narsapur ) Doubling railway track.
--------------------ఇంకా మట్టి పనులే పూర్తి కాలేదు:------------
భీమవరం-నిడదవోలు, భీమవరం-నరసాపురం మార్గంలో పనులు ఏడాదిన్నర కిందటే ప్రారంభించారు. వాటిలో నిడదవోలు మార్గానికి మొదట్లో రూ.301 కోట్లు కేటాయించారు. పనులు ఆలస్యం వల్ల రూ. 393 కోట్లకు వ్యయం పెరిగింది. నరసాపురం మార్గానికి మొదట్లో రూ.164 కోట్లు కేటాయించగా అది ప్రస్తుతం రూ.230 కోట్లకు చేరింది.అయినా ఇంకా మట్టి పనులనే చేస్తున్నారు. మరో పక్క కీలకమైన వంతెనల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం మట్టి పనులతో పాటు చిన్న కల్వర్టులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రస్తుత సీజన్లో మట్టి పనులు వేగంగా జరిగే పరిస్థితి లేదు. భీమవరం-నిడదవోలు మార్గానికి సంబంధించి...
more... భీమవరం వద్ద యనమదుర్రు డ్రెయిన్పై, వేండ్ర వద్ద గోస్తనీనదిపై, విస్సాకోడేరు కాలువపై, నిడదవోలు వద్ద ఏలూరు కాలువపై, రేలంగి వద్ద పంట కాలువపై పెద్ద వంతెనలు నిర్మించాల్సి ఉంది. ప్రధానమైన ఐదు వంతెనలతో పాటు 185 చిన్నవంతెనలు (కల్వర్టులు) ఏర్పాటు చేయాలి. ఇవన్నీ నిర్మించిన తర్వాత విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. విజయవాడ-మోటూరు, మోటూరు-భీమవరం టౌన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిని మిగిలిన వాటి కంటే చాలా ముందుగా ప్రారంభించారు. ఈ మార్గాల్లో ప్రధానమైన ఉప్పుటేరు, ఉండి కాలువ, వెంకయవయ్యేరు కాలువలపై భారీ వంతెనలు నిర్మించాలి. చిన్న వంతెనల నిర్మాణం పూర్తయింది.
------------------ఏడాదిలోగా రైళ్ల రాకపోకలు-----------------------------
ఒక ఏడాది లోపు మోటూరు నుంచి కైకలూరు, ఆకివీడు వరకు పనులు పూర్తవుతాయి. అవి అయిన వెంటనే ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభం అవుతాయి. మట్టి పని, చిన్న వంతెనల నిర్మాణం పూర్తయ్యాయి. పెద్ద వంతెనల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులన్నీ వేగంగా చేస్తున్నాం. భీమవరం-నిడదవోలు, నరసాపురం ప్రాజెక్టుల్లో మట్టి పనులు జరుగుతున్నాయి. చిన్న కల్వర్టుల నిర్మాణం వేగవంతమయ్యాయి. ప్రస్తుతం వర్షాల వల్ల పనులు నెమ్మదిగా చేయాల్సి వస్తుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కృషి చేస్తుంది.
- నాగేశ్వరరావు, సహాయ మేనేజర్, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్
more Info:
source enaadu click here