Visakhapatnam : click here
వారానికి రెండుసార్లు షిర్డీ రైలు!
జెడ్ఆర్యూసీసీ సభ్యులు ధర్మాల వెల్లడి
రైల్వేస్టేషన్, న్యూస్టుడే:
విశాఖపట్నం నుంచి షిరిడీ సాయినగర్ ఎక్స్ప్రెస్ రైలు ఈ ఏడాదిలోనే వారానికి రెండు రోజులు చొప్పున...
more... తిరగనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే జెడ్ఆర్యూసీసీ సభ్యులు ధర్మాల ఆనంద్రెడ్డి తెలిపారు. ఈ నెల 9న భువనేశ్వర్ రైలు సదన్లో జరిగిన జెడ్ఆర్యూసీసీ సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాలను ఆదివారం విలేకర్లకు ఆయన వివరించారు. ప్రధానంగా షిరిడీ యాత్రికుల కోసం విశాఖ నుంచి ప్రతి గురువారం నడిచే వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులర్గా గాని, రోజు విడిచి రోజుగాని నడపాలని పలుమార్లు ప్రతిపాదించామని శుక్రవారం జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించామని, దీన్ని అమలుచేసేలా రైల్వే మంత్రిత్వశాఖ తీసుకోబోతోందన్నారు.
కాశీ యాత్రికుల కోసం విశాఖ-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక లింక్ సర్వీసు
ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే కాశీ యాత్రికుల కోసం విశాఖ నుంచి నేరుగా రైలు సౌకర్యం లేదని, భువనేశ్వర్ నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమావేశంలో ప్రత్యేక అంశంగా ప్రస్తావించామన్నారు. దీంతో వారణాశి రైలుకు అనుసంధానంగా విశాఖ-భువనేశ్వర్ మధ్య వారానికి రెండుసార్లు నడిచేలా ఓ ఎక్స్ప్రెస్ రైలు ఏర్పాటుకు ప్రతిపాదనలను కూడా రైల్వే మంత్రిత్వ శాఖకు అందించామన్నారు. ఇదికూడా ఈ సంవత్సరంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తూ.కో. రైల్వే సిఫార్సు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8 ప్లాట్ఫాంలు ఉన్న విశాఖ రైల్వేస్టేషన్లో మరో నాలుగు ప్లాట్ఫాంలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. దీనిపై తూ.కో రైల్వే సానుకూలంగా స్పందించిందన్నారు.