ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రా లలోని 39 నగరాలు, పట్టణాలలో ఆక్సిజెన్ ను దించాయి. అవి: ఉత్తరప్రదేశ్ లోని లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్ పూర్, ఆగ్రా మధ్యప్రదేశ్ లోని సాగర్, జబల్పూర్, కట్నీ, భోపాల్, మహారాష్టలోని నాగపూర్, నాసిక్, పూణె, ముంబయ్, సోలాపూర్, తెలంగాణలో హైదరాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్, గురుగావ్, ఢిల్లీలోని తుగ్లకాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్, ఓఖ్లా,రాజస్థాన్ లోనిఒ కోట, కనక్ పరా, కర్నాటకలోని బెంగళూరు, ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, గుంటూరు తాడిపత్రి, విశాఖపట్నం, కేరళలో ఎర్నాకుళం, తమిళనాడులో తిరువళ్ళూరు, చెన్నై, తూత్తుకుడి, కోయంబత్తూరు, మదురై, పంజాబ్ లోని భటిండా, ఫిల్లౌర్, అస్సాంలోని కామరూప్, జార్ఖండ్ లోని రాంచీ
భారతీయ రైల్వేలు అన్ని మార్గాలలో ఆక్సిజెన్ అందించటానికి వీలుగా సన్నాహాలు చేసుకోగలిగింది., అందువలన ఎలాంటి అత్యవసర పరిస్థితి...
more... తలెత్తినా అందుకు అనుగుణంగా అతి తక్కువ సమయంలో చేరుకోగల ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఆక్సిజెన్ తీసుకురావటానికి అవసరమైన టాంకర్లను ఆయా రాష్ట్రాలు సమకూర్చుతాయి. పశ్చిమాన హాపా, బరోడా, ముంద్రా మొదలుకొని తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటా నగర్, అంగుల్ నుంచి ఆక్సిజెన్ ను తీసుకొని ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు అందజేయగలిగింది. అలా ఎక్కడినుంచి ఎక్కడికైనా మోసుకెళుతూ సంక్లిష్టమైన కార్యక్రమాన్ని సైతం నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలిగింది.
సాధ్యమైనంత వేగంగా తక్కువ సమయంలో చేరేలా చూడటానికి రైల్వే శాఖ సరకు రవాణాలో సరికొత్త ప్రమాణాలు సృష్టించుకొని అందుకు అనుగుణంగా ఆక్సిజె న్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడిపింది. ఎక్కువ దూరం నడిచే మూడు కీలకమైన మార్గాలలోని రైళ్ల సగటు వేగం గంటకు 55 కిలోమీటర్లకు పైనే ఉంది. అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రీన్ కారిడార్ లో దారి ఇస్తూ అత్యవసర పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించటంలోనూ, వివిధ జోన్ల మధ్య సమన్వయం సాధించటం వల్లనే ఇది సాధ్యమైంది. దీన్నొక సవాలుగా తీసుకొని రేయింబవళ్ళు అప్రమత్తంగా ఉండటం వల్లనే సకాలంలో ఆక్సిజెన్ అందించిన తృప్తి రైల్వేలకు దక్కింది. వివిధ సెక్షన్లలో సిబ్బంది మారటం లాంటి సాంకేతిక అనివార్యతలకు కేవలం ఒక నిమిషం మాత్రమే ఆపటం ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకిచ్చిన ప్రాధాన్యానికి అద్దం పట్టింది.
ఆక్సిజెన్ రైళ్ళ రాకపోకలకు అంతరాయం గాని ఆలస్యంగాని జరగకుండా చూసేందుకు అన్ని ట్రాక్ లూ తెరచి ఉంది నిర్వహణ కార్యకలాపాలలో పూర్తి అప్రమత్తంగా ఉండటం గమనించవచ్చు. అదే సమయంలో ఇతర సరకు రవాణా వేగం ఏ మాత్రమూ తగ్గకుండా చూడగలగటం కూడా విశేషం. ఆక్సిజెన్ రైళ్ళు నడపటం ఒక కొత్త అనుభవమే అయినా ఎప్పటికప్పుడు అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటూ రైల్వే శాఖ ముందుకు సాగింది. ఈ రాత్రి కూడా పొద్దుపోయాక మరిన్ని ఆక్సిజెన్ రైళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి.
***